ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై మండిపడుతున్న టీడీపీ నేతలు

  • పేదలపై వెయ్యి కోట్ల రూపాయల భారం  పడింది
  • ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి
  • టీడీపీ నేతలు యనమల, ప్రత్తిపాటి 
ఏపీస్ ఆర్టీసీ ఛార్జీల పెంపుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా పేదలపై వెయ్యి కోట్ల రూపాయల భారం పడుతుందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, బకాయిలు, అప్పులు, నష్టాలు ప్రభుత్వమే భరిస్తుందని సీఎం జగన్ చెప్పారని గుర్తుచేశారు. టీడీపీకి చెెందిన మరోనేత ప్రత్తిపాటి పుల్లారావు స్పందిస్తూ, ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Apsrtc
Telugudesam
cm
jagan

More Telugu News